తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గురు శుక్రవారాలలో జబర్దస్త్ షో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.
జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.కమెడియన్లు గా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి నటులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇకపోతే జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా కమెడియన్ లు జబర్దస్త్ ను విడిచి వెళ్తున్నారు.
ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ లు జబర్దస్త్ షోని విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా జబర్దస్త్ లో కొద్ది రోజుల నుంచి కమెడియన్ అదిరే అభి కనిపించడం లేదు.జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి కమెడియన్ అదిరే అభి పని చేస్తూ వచ్చాడు.
అదిరే అభి టీమ్ లో నుంచి ఎంతోమంది వెలుగు లోకి కూడా వచ్చారు.జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రస్తుతం ఈ రేంజ్ లో ఉన్నాడు అంటే అందుకు గల కారణం అదిరే అభి అన్న విషయం తెలిసిందే.
ఇక అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి విడిపోయాడు అన్న విషయం తెలిసిందే.జబర్దస్త్ నుంచి విడిపోయిన తరువాత రెండు వారాలపాటు కామెడీ స్టార్స్ షోలో కనిపించాడు అభి.ఇక కామెడీ స్టార్స్ లో కూడా వర్కౌట్ అవకపోవడంతో అదిరింది షోకీ ఎంట్రీ ఇచ్చాడు అభి.
కేవలం అభి మాత్రమే కాకుండా అప్పారావు, రాజమౌళి, జీవన్ వంటివారిని అదిరింది షోకీ తీసుకువచ్చారు.అదిరింది షోకి నాగబాబు, శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ షోకి యాంకర్ గా దీపిక పిల్లి వ్యవహరిస్తోంది.
కామెడీ స్టార్స్ లో అభి కనిపించకపోవడంతో అక్కడి నుంచి జంప్ అయి అదిరింది షో కి వచ్చినట్లు కనిపిస్తోంది.అభి మరొక వైపు దర్శకుడు,హీరో అంటూ వెండి తెరపై కూడా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇకపోతే జబర్దస్త్ షో కి జడ్జీలుగా రోజా, సింగర్ మను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.