టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే.రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండ చూస్తుండగానే పాన్ ఇండియా స్టార్ గా మార్క్ ని క్రియేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతోంది.
ఈ సినిమాకు నిర్మాతగా చార్మి వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ తన నటనతో యూత్ ని ఆకట్టుకుంటున్నాడు ఈ రౌడీ హీరో.విజయ్ దేవరకొండ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే మొత్తం షూటింగ్ ఫినిష్ అయినట్టు తెలుస్తోంది.ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని చిత్రబృందం ఆలోచిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఆ సినిమాకు రాంపేజ్ అనే టైటిల్ కూడా పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆ సినిమాకు విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకోవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.ఒకేసారి 40 కోట్లు కూడా దాటవచ్చు అని తెలుస్తోంది.
అ ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోటున్నట్లు తెలుస్తోంది.అయితే లైగర్ సినిమాకు కూడా విజయ్ దేవరకొండ భారీగానే పారితోషికం అందుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమాతో విజయ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.