ఆదిపురుష్ పై వస్తున్న రూమర్ పై టీమ్ క్లారిటీ.. అది నిజం కాదంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా ‘ఆదిపురుష్’.రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

 Adipurush Movie Makers Clarity About Rumors, Adipurush, Prabhas, Om Raut, Kriti-TeluguStop.com

ప్రభాస్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించేసి గుమ్మడి కాయ కొట్టిన విషయం కూడా తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Telugu Adipurush, Adipurushmakers, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Alikhan-M

ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడని గ్రాండ్ విజువల్ వండర్ ను ఆదిపురుష్ సినిమా ద్వారా చూపించ బోతున్నాడు ఓం రౌత్.ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.ఇండియన్ అన్ని భాషల్లో డబ్ చేస్తారని అంటున్నారు.

అయితే ఈ సినిమా గురించిన ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాను ఏకంగా 20 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

హాలీవుడ్ సినిమాలు కూడా ఆ స్థాయిలో విడుదల అవ్వడం సాధ్యం కాదు.అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతుంది.

కేవలం ఈ వార్త పుకార్లే అన్నట్టు అధికారికంగా చెబుతుంది.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీదనే శ్రద్ధ పెట్టినట్టు మేకర్స్ చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube