సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడానంటూ లక్ష్మీపార్వతి షాకింగ్ విషయాలను వెల్లడించారు.ఈరోజు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులను అర్పించారు.26 సంవత్సరాల తర్వాత తాను ఒక రహస్యం చెబుతున్నానని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.జీవిత, రాజశేఖర్ సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో మద్రాస్ లో ఒక అమ్మాయితో మాట్లాడించారని లక్ష్మీపార్వతి అన్నారు.
ఆ సమయంలో 16 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అమ్మాయి శరీరంలో సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించడంతో పాటు తనతో ఆత్మ ఎన్నో విషయాలను పంచుకుందని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
అందరు సీఎంల మనసులో తాను ఉంటానని తెలుగు రాష్ట్రాలలో తాను జన్మిస్తానని ఎన్టీఆర్ ఆత్మ తనతో చెప్పిందని లక్ష్మీపార్వతి కామెంట్లు చేశారు.ఎన్టీఆర్ ఆత్మ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రబోధం చేస్తానని చెప్పినట్టు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
లక్ష్మీ పార్వతి చేసిన ఈ కామెంట్ల గురించి చర్చ జరుగుతోంది.ఆ యువతితో మాట్లాడిన తర్వాత తనకు నమ్మకం కలిగినట్టు లక్ష్మీపార్వతి కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకాలలోనే తాను జీవిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు.బ్రతికున్న సమయంలో ఎన్టీఆర్ తనకు తోడుగా ఉండటంతో పాటు తనను రక్షించుకున్నారని లక్ష్మీపార్వతి వెల్లడించారు.ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయుడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.లక్ష్మీపార్వతి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.లక్ష్మీపార్వతి ఆత్మతో మాట్లాడటం ఏమిటని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ల గురించి జీవిత, రాజశేఖర్ స్పందించాల్సి ఉంది. లక్ష్మీపార్వతి కామెంట్లపై నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.