ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా పరిశ్రమపై మళ్లీ కరోనా పంజా పడుతోంది.ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఇప్పటికే ఫస్ట్, సెకెండ్ వేవ్ కరోనా తర్వాత టాలీవుడ్ నటీనటులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగుల్లో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్లీ రిస్క్ తీసుకునేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు.ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడ్డారు.
పలు సినిమా షూటింగులు కూడా నిలిచిపోయాయి.టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు సైతం సెట్స్ మీదకు రావడానికి రెడీ అయినా.
ఆయా నటులు రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే వరుసగా ఈ సినిమాలు సెట్స్ మీదకు వస్తున్నాయి.అయితే కరోనా కేసులు పెరగడంతో కొంత కాలం షూటింగులకు దూరంగా ఉండాలని భావిస్తున్నాడట.
అంటే బాలయ్య కూడా మలినేని గోపీచంద్ తో ఓ సినిమాకు ఓకే చెప్పాడు.ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ మీదకు రావాలి.
అయితే మరికొన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ మీదనే కాన్సెంట్రేట్ చేయాలనుకుంటున్నారట.
అటు కరోనా నుంచి కోలుకున్న మహేష్ బాబు.ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు.అటు రష్యా నుంచి ఇండియాకు వచ్చిన పవర్ స్టార్ కూడా హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉన్నా.
కరోనా కారణంగా మరికొద్ది రోజుల తర్వాత సెట్స్ మీదకు వెళ్లేలా ప్రయత్నిస్తున్నారు.
అటు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ పుష్ప-2 కూడా వచ్చే నెల నుంచి షూటింగ్ జరగాల్సి ఉండేది.అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మార్చికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.అటు త్రిఫులర్ ఆర్ సినిమా హీరోలు సైతం షూటింగుల్లో పాల్గొనడం లేదు.
అటు అనుష్కకు కూడా కరోనా భయం పట్టుకుందట.ఈ నేపథ్యంలో నవీన్ పొలిశెట్టి సినిమాకు డేట్స్ ఇవ్వలేదట.
వీరితో పాటు మరికొంత మంది స్టార్స్ కూడా కరోనా మూలంగా షూటింగులకు రాలేమని చెప్తున్నారట.