నడుము నొప్పి.ఎందరినో వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
ముఖ్యంగా స్త్రీలు తరచూ నడుము నొప్పి బారిన పడుతూ తీవ్ర వేదనకు గురవుతుంటారు.ఎక్కువ సేపు వంగి పని చేయడం, ఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం లేదా నిలబడటం, వెన్నుకు దెబ్బ తగలడం, వెన్నెముక బలహీనంగా మారడం, డ్రైవింగ్ ఇలా రకరకాల కారణాల వల్ల నడుము నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
అలాంటి సమయంలో దాదాపు అందరూ పెయిన్ కిల్లర్స్ను వేసుకుని నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందుతారు.
అయితే పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పి నుంచి విముక్తిని కలిగించినా.
భవిష్యత్తులో మాత్రం అనేక సమస్యలను తెచ్చి పెడతాయి.అందుకే పెయిన్ కిల్లర్స్ను వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
మరి నడుము నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తున్నారా.? అందుకు మిరప గింజలు అద్భుతంగా సహాయపడతాయి.
అవును, మీరు విన్నది నిజమే మిరప గింజలతో నడుము నొప్పిని తగ్గించు కోవచ్చు.
మరి అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆరు స్పూన్ల కొబ్బరి నూనె, ఒక స్పూన్ మిరప గింజలు, ఒక స్పూన్ మిరియాలు వేసి మాడిపోయేంత వరకు వేయించాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి.
ఆపై నూనెను మాత్రం ఫిల్టర్ చేసుకుని ఒక గాజు సీసాలో నింపుకోవాలి.
ఇప్పుడు నడుముకు ఈ నూనెను అప్లై చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి.ఇలా చేస్తే నడుము నొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది.నడుముకే కాదు నొప్పి ఎక్కడ ఉన్నా ఈ నూనెను రాసి మసాజ్ చేసుకుంటే వెంటనే మంచి ఫలితం లభిస్తుంది.