మరికొద్ది నెలల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతోంది.ఈ నేపథ్యంలో రిటెన్షన్, మెగా ఆక్షన్ లాంటి ప్రక్రియలు శరవేగంగా పూర్తవుతున్నాయి.
నయా ఫ్రాంచైజీలు జనవరి 22వ తేదీలోగా ముగ్గురు చొప్పున ప్లేయర్లను నేరుగా ఎంపిక చేసుకోవాలని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అఫ్గానిస్థాన్ మేటి ప్లేయర్ రషీద్ ఖాన్, ఓపెనర్ శుభ్మన్ గిల్ కలిసి కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్లోకి జంప్ చేశారట.వీళ్ల ముగ్గురిని అహ్మదాబాద్ జట్టు కొనుగోలు చేసిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వాస్తవానికి అహ్మదాబాద్ మూడో ప్లేయర్గా ఇషాన్ కిషన్ను కొనుగోలు చేసిందని మొన్నటివరకు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ న్యూస్ సంస్థ ఈఎస్పీఎన్ మాత్రం అహ్మదాబాద్ జట్టు ఇషాన్ కిషన్కు బదులు శుభ్మన్ గిల్ను తీసుకుందని వెల్లడించింది.
అలాగే ఈ త్రయం జీతాల వివరాలను కూడా పేర్కొంది.ఐపీఎల్ రూల్స్ కి అనుగుణంగా జట్టు ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేస్తే.మొదటి ప్లేయర్ కు రూ.15 కోట్లు, రెండో ఆటగాడికి రూ.11 కోట్లు, మూడో క్రికెటర్ కు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.అయితే అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్లకు రూ.15 కోట్ల చొప్పున చెల్లించడానికి రెడీ అయిందని.శుభ్మన్ గిల్కు రూ.7 కోట్లకు ఇచ్చేందుకు సిద్ధమైందని ఈఎస్పీఎన్ తెలిపింది.
హార్దిక్ పాండ్యా వెన్నుముక గాయం తర్వాత ఇంతకు ముందులాగా ఆడ లేకపోతున్నాడు.ప్రస్తుతం అతడు తన ఫిట్నెస్పై దృష్టిసారిస్తున్నాడు.ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్న హార్దిక్ ఈసారి ఐపీఎల్ లో రాణిస్తారని అహ్మదాబాద్ ఫ్రాంచైజీ భావిస్తోంది.2021 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన రషీద్ ఖాన్ ఎక్కువ జీతం కోసం అహ్మదాబాద్ జట్టుకు వెళ్లిపోయాడని తెలుస్తోంది.శుభ్మన్ గిల్ గతేడాది వరకు కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడాడు.అతన్ని ఆ జట్టు వదిలించుకోవడంతో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.