కోలీవుడ్ డైరక్టర్ వెంకట్ ప్రభు డైరక్షన్ లో శింబు హీరోగా వచ్చిన సినిమా మానాడు.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు శింబు.
సినిమాతోని కొన్నాళ్లుగా సరైన హిట్ లేని శింబుకి మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది.ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ వర్షన్ ది లూప్ రిలీజ్ చేయాలని అనుకోగా లాస్ట్ మినిట్ లో ఆపేశారు.
మానాడు రీమేక్ రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈ రీమేక్ లో మొన్నటి వరకు రానా దగ్గుబాటి నటిస్తాడని వార్తలు రాగా లేటెస్ట్ గా ఆ ఛాన్స్ తమ్ముడు అభిరాం కొట్టేశాడని టాక్.
మానాడు తో అక్కడ శింబు తిరిగి ఫాం లోకి రాగా అదే సినిమాతో దగ్గుబాటి వారసుడి తెరంగేట్రం చేయాలని చూస్తున్నాడు సురేష్ బాబు.
అసలైతే అభిరాం మొదటి సినిమా తేజ డైరక్షన్ లో వస్తుందని అన్నారు.ఆ సినిమా షూటింగ్ కూడా జరుపుతున్నారని టాక్.కానీ మానాడు రీమేక్ తోనే అభిరాం డెబ్యూ చేయాలని నిర్ణయించారట.మరి ఈ రీమేక్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారు.
మిగతా విషయాలు త్వరలో బయటకు వస్తాయి.మానాడు రీమేక్ కోసం సురేష్ బాబు ఓ స్టార్ డైరక్టర్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.
అదే జరిగితే అభిరాం కి ఈ సినిమా మంచి డెబ్యూ మూవీ అవుతుందని చెప్పొచ్చు.