బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది ప్రియాంక చోప్రా.
బాలీవుడ్ లో వరుసగా టాప్ హీరోలతో సినిమాలు నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో కొద్దిరోజుల పాటు ఒక వెలుగు వెలిగింది.ఇక ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ప్రియాంక చోప్రా.
ఇక ఈమె 2018 లో అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఇక ఈ జంట పెళ్లి అయ్యి 3 ఏళ్లు అయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.తాను భవిష్యత్తులో తల్లి కావాలి అని ఎదురు చూస్తున్నానని, అది జరిగినప్పుడు తమ జీవితాల్లో జరిగే మార్పులను ఎంజాయ్ చేయడానికి తన భర్త నిక్ జోనస్ తో పాటు తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
పిల్లలు లైఫ్ లో ఒక భాగం మాత్రమే కాదని.అంతకు మించి వారికి ప్రాధాన్యత ఉందని పేర్కొంది.
వారిద్దరూ పనిలో చాలా బిజీగా ఉన్నారు కదా అని అడగగా.తాము అంత బిజీగా లేము అంటూ కొంచెం బోల్డ్ గానే సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.
ఇక సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా అభిమానులు ఆమెకు పెళ్లి అయ్యి 3 ఏళ్లు అయిన సందర్భంగా పిల్లలు ఎప్పుడూ అంటూ కామెంట్స్ చేయగా, కొందరు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారు అని కామెంట్లు చేస్తున్నారు.ప్రియాంక చోప్రా కొన్నిసార్లు సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు చేసినప్పుడు, అలాగే తన అభిమానులతో ముచ్చటించిన ప్రతిసారి ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది ప్రియాంక చోప్రా.