డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రవి ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ బాబు లుక్, ఫస్ట్ గ్లింప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి ఒక పాటను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ గతంలో ప్లాన్ చేశారు.అంతే కాకుండా ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తెలిపాడు.
కానీ తాజాగా ఈ సినిమా నుండి మ్యూజికల్ ఫీస్ట్ రావట్లేదని సర్కారు వారి పాట టీమ్ తెలియజేసింది.కారణం ప్రస్తుతం కోవిడ్ ప్రభావం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఇక ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ కూడా తెలియజేసింది.సంక్రాంతికి సర్కారు వారి పాట నుంచి ఇద్దామనుకున్న మ్యూజికల్ ఫీస్ట్ ను కరోనా కారణంగా ఇవ్వలేకపోతున్నామని క్షమాపణలు తెలిపారు.
ఇక దీంతో ప్రేక్షకులలో ఈ సినిమా నుండి మరో నిరాశ ఏర్పడింది.ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటంతో నిరాశలో ఉన్న ప్రేక్షకులకు మహేష్ సినిమా నుండి కూడా నిరాశనే ఎదురయింది.ఇక ఏప్రిల్ 1న వాయిదా పడిన సినిమాలు విడుదల కానున్నట్లు వార్తలు వినిపించగా.బహుశా ఆగస్టు 5న సర్కారు వారి పాట విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.