ప్రకాశం జిల్లా కారంచేడులో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హల్ చల్ చేస్తున్నాడు.సంక్రాంతి సందర్భంగా కారంచేడులోని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుటుంబం పండుగను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
నిన్న భారీగా తరలివచ్చిన అభిమానులతో కొంతసేపు మాట్లాడిన బాలకృష్ణ, ఈరోజు ఇలా గుర్రం పై కుర్చుని స్టెప్పులు వేయిస్తూ సందడి చేసారు.అనంతరం కుమారుడు మోక్షజ్ఞ కూడా గుర్రం పై సందడి చేసారు.
దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఎద్దుల బండిని నడిపిస్తూ అభిమానులను పలికరించాడు.
మరోవైపు బాలకృష్ణ ను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు.