రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల ఫ్యామిలీ పై ఫైర్ అయ్యారు.శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తీవ్రంగా స్పందించారు.
పరిటాల శ్రీరామ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తోపుదుర్తి కుటుంబీకులపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్గా గా ప్రకాష్ రెడ్డి ప్రత్యారోపణలు చేశారు.అక్రమంగా సంపాదించినది ఎవరో ప్రజలకు తెలుసునని మండిపడ్డారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కనీసం టికెట్లు కూడా తెచ్చుకో లేరంటూ పరిటాల కుటుంబం పై సెటైర్లు వేశారు.