1.భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
భారత్ లో తదుపరి అమెరికా రాయబారిగా ఎరిక్ గర్సెట్టి నియామకానికి అమెరికా చట్ట సభ ఆమోదం తెలిపింది.
2.భారత సంతతి వ్యక్తికి అరుదైన అవకాశం
భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది.ప్రముఖ బిజినెస్ స్కూల్ డీన్ గా నియామకం అయ్యారు.భారత సంతతికి చెందిన సౌమిత్రి దత్తాను సయీద్ బిజినెస్ స్కూల్ డీన్ గా నియమిస్తూ అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
3.కువైట్ లో 866 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ
2021 లో దాదాపు 866 మంది ప్రవాసులకు కువైట్ దేశ బహిష్కరణ విధించింది.
4.ఉక్రెయిన్ లో సైబర్ దాడి
ఉక్రెయిన్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.ఎన్నో ప్రముఖ వెబ్ సైట్లను హ్యక్ చేశారు.ఎంబసీలు కూడా హ్యాక్ కు గురయ్యాయి.
5.ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభం
ఆఫ్ఘన్ లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం తదితర కారణాలతో ఆకలితో ఎంతోమంది అలమిటిస్తున్నారు.ఎంతో మంది తమ కిడ్నీలు అమ్ముకుని పోషణ చేసుకుంటున్న పరిస్థితి అక్కడ తలెత్తింది.
6.దక్షిణాఫ్రికా లో తగ్గుముఖం పట్టిన కరోనా
దక్షిణాఫ్రికా లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.ప్రస్తుతం నమోదవుతున్న కేసులు దాదాపు 14 శాతం తగ్గుముఖం పట్టాయి.
7. నేపాల్ లో కరోనా విజృంభణ
నేపాల్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ వర్కర్లు చాలామంది కరోనా వైరస్ ప్రభావం కు గురయ్యారు.
తాజాగా ఖాట్మాండ్ లో ని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 143 మంది వైద్య సిబ్బంది కరోనా ప్రభావానికి గురయ్యారు.