ఇండస్ట్రీ బిడ్డగా అతని ఆహ్వానం మేరకే వచ్చాను: మెగాస్టార్

గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య ఉన్న వివాదం నేటితో ఓ కొలిక్కి రానుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిరంజీవికి నేడు అపాయింట్మెంట్ ఇవ్వడంతో చిరంజీవి నేడు మధ్యాహ్నం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు.

 I Came At His Invitation As An Industry Kid Megastar, Chiranjeevi, Tollywood, He-TeluguStop.com

ఈ క్రమంలోనే చిరంజీవి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా విజయవాడకు చేరుకొని తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే చిరంజీవికి గన్నవరం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, వాటి గురించి చర్చించడం కోసమే విజయవాడ వచ్చాను.

సినీ ఇండస్ట్రీకి చెందిన బిడ్డగా, ఆయన ఆహ్వానం మేరకే వచ్చానని చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు.సీఎంతో భేటీ అనంతరం తదుపరి విషయాలను వెల్లడిస్తానని చిరంజీవి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube