టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.అలాగే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ వ్యవహరిస్తున్నారు.
మహేష్ బాబు భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి లాంటి సినిమాలతో సూపర్ హిట్ టాక్ ను అందుకొని దూసుకుపోతున్నాడు.
సర్కారు వారి పాట సినిమాతో త్వరలోనే మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.ఇకపోతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే షూటింగ్ లో భాగంగా మహేష్ కాలికి దెబ్బ తగలడంతో సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మహేష్ బాబు లేకుండానే జరుగుతోంది అని తెలుస్తోంది.
మహేష్ బాబు కాలికి సర్జరీ అయి ప్రస్తుతం దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ఇటీవలే మహేష్ బాబు కి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది.దీంతో ఇప్పట్లో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనే సూచనలు కనిపించక పోవడంతో చిత్రబృందం మహేష్ బాబు లేని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తోంది.ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ వైజాగ్ బీచ్ రోడ్ లోని జగదాంబ సెంటర్ పరిసర ప్రాంతాల్లో శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇక సర్కారు వారి పాట సినిమాను ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ శరవేగంగా పూర్తి చేసేస్తోంది చిత్ర బృందం.