స్టార్ హీరో అల్లు అర్జున్ సక్సెస్ రేట్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు కాగా ఈ హీరో కెరీర్ లోని హిట్లలో దేశముదురు, ఎవడు, అల వైకుంఠపురములో సినిమాలు ఉన్నాయి.ఈ మూడు సినిమాలు వేర్వేరు సంవత్సరాలలో విడుదలైనా మూడు సినిమాలు సక్సెస్ సాధించాయి.
ఈ మూడు సినిమాలు ఒకే తేదీన విడుదల కాగా బన్నీకి నటుడిగా ఈ మూడు సినిమాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.దేశముదురు, అల వైకుంఠపురములో సినిమాలలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించిన బన్నీ ఎవడు సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.
భవిష్యత్తులో కూడా బన్నీ వీలైతే ఇదే తేదీన సినిమాను విడుదల చేయాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు.అల్లు అర్జున్ కు మళ్లీ మళ్లీ విజయాలను ఇచ్చిన రోజుగా జనవరి 12వ తేదీ నిలిచింది.బన్నీ పుష్ప ది రైజ్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు.పుష్ప ది రైజ్ అంచనాలను మించి కలెక్షన్లను సాధించి ఏపీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించడం గమనార్హం.
ఏపీలో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏపీలోనే లాభాలను సొంతం చేసుకోలేదు.మరోవైపు ఓటీటీలో పుష్ప మూవీ అందుబాటులోకి రావడంతో పుష్ప సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక్కసారిగా కలెక్షన్లు తగ్గాయి.బన్నీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప ది రైజ్ నిర్మాతలకు మాత్రం భారీ లాభాలను మిగిల్చింది.మరోవైపు దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ పనులను మొదలుపెట్టారు.
పుష్ప ది రైజ్ సక్సెస్ తర్వాత పుష్ప ది రూల్ లో సుకుమార్ చేస్తున్న మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు.రెండు పార్టులుగా సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కించడం సరైన నిర్ణయమే అని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.