ఈ సమాజం లో బతుకుతన్న వారందరికీ కూడా సమస్యలపై స్పందించాలనే తపన ఉండాలి.అంతేగానీ నాకెందుకు అనే బద్ధకం ఉండకూడదు.
కానీ ఇప్పుడు దేశంలో చూసుకుంటే చాలా మందికి ఇలాంటి బద్ధకమే ఉంది.సమస్యలపై స్పందిస్తే ఎక్కడ తమకు ఇతరుల నుంచి సమస్యలు వస్తాయో అనే భయమే కనిపిస్తుంది.
ఇలా అనేక కారణాల వల్ల చదువుకున్న వారు సైతం తమ కండ్ల ముందు కదలాడే అనేక సమస్యలపై స్పందించ కుండా నిమ్మకుండి పోతున్నారు.ఇలాంటప్పుడే కొందరు ముందుకు వచ్చి వాటిపై పోరాడుతారు.
ఇలా పోరాడేందుకు ఎలాంటి వయసు గానీ, ఇతర సమీకరణాలను చూసు కోకుండా పోరాడుతారు.మన వెనకాల ఎవరున్నారు, మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే వాటిని పక్కన పెట్టేస్తారు.
కేవలం తమ ముందు జరిగే వాటి మీద ప్రశ్నించాలి అనే తపన మాత్రమే వారిలో కనిపిస్తుంది.అలాంటి వారికి గుండె ధైర్యం చాలా ఎక్కువ గానే ఉంటుందండోయ్.
అయితే ఇప్పుడు మాటలు కూడా పెద్దగా రానటువంటి ఓ చిన్నారి తమ ప్రాంతంలో రోడ్ల సమస్యలపై గళమెత్తింది.కాశ్మీర్ లో రోడ్లు చాలా అద్వానంగా ఉండటంతో వాటి మీద ఆమె రిపోర్టర్ గా మారి ప్రశ్నించింది.
అక్కడ రోడ్లను చూపిస్తూ.ప్రొఫెషనల్ రిపోర్టర్ మాదిరిగానే మాట్లాడుతోంది ఆ చిన్నారి. ఓ సీనియర్ రిపోర్టర్ అయితే ఆ పాడైన రోడ్ల మీద ఎలాంటి స్టోరీ అయితే చేస్తాడో.అలాగే ఆ చిన్నారి కూడా చాలా బాగా వర్ణిస్తూ చెప్పుకొచ్చింది.
ఎంతైనా.బాధను చూసి చెప్పే వారి కంటే.
అనుభవించి చెప్పే వారికే దాని విలువ ఏంటో తెలుస్తుంది.ఈ చిన్నారి కూడా ఆ రోడ్ల వల్ల బాధపడినట్టు ఉంది.
అందుకే అంత ఆవేదనతో వివరిస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది.
అద్భుతంగా చెప్పావ్ అంటూ అందరూ ఆ చిన్నారిని మెచ్చుకుంటున్నారు.
.