టాలీవుడ్ హీరోలు ఇటీవలి కాలంలో సినిమాల మీదే కాదు వాణిజ్య ప్రకటనల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఈ క్రమంలోనే జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ కూడా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ నుంచి వాణిజ్య ప్రకటనల్లో నటించడం లో టాప్లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి.ఎన్నో ఏళ్ల నుంచి థమ్స్ అప్ యాడ్ లో మహేష్ బాబు కొనసాగుతూ వస్తున్నాడు.
ఇంకా ఎన్నో యాడ్స్ లో కూడా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు.గతంలో రామ్ రాజ్ వాణిజ్య ప్రకటనల్లో కూడా వెంకటేష్ నటించిన అందరినీ అలరించారు.
ఇక వెంకటేష్ వాణిజ్య ప్రకటన చేయడంతో రామ్ రాజ్ పంచెలు అందరికీ దగ్గరయ్యాయి అని చెప్పాలి.ఇప్పుడు అచ్చం ఇలాగే ఉదయం పంచలు అంటూ ముందుకు వచ్చేసారు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున.
ఇటీవలి కాలంలో నాగార్జున కు వాణిజ్య ప్రకటనలో డిమాండ్ బాగా పెరిగిపోయింది.ప్రస్తుతం ఎంతో మంది యువ హీరోలు స్టార్ లుగా కొనసాగుతున్నప్పటికీ సీనియర్ హీరో అంటూ పేరున్న నాగార్జునకు వాణిజ్య ప్రకటనలో డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.
నాగ్ వయసు 60 ఏళ్లు దాటి పోతుంది.కానీ ఇప్పటికీ ఫిజిక్ మెయింటైన్ చేశాడు.
పెద్ద వాళ్ళలో పెద్ద వారిలాగా యువకుల్లో యువకుడిగా కనిపిస్తాడు నాగార్జున.
అంతేకాదండోయ్ ఒకవైపు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నాగార్జున ఇటీవలి కాలంలో బిగ్ బాస్ అనే కార్యక్రమంతో ప్రతి ఇంటికి చేరువ అయిపోయాడు.దీంతో నాగార్జునతో బ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహిస్తే బాగా కలిసొస్తుందని నమ్ముతున్నాయి కంపెనీలు.దీంతో ఇక ఈ టాలీవుడ్ మన్మథుడు కోసం భారీగా అని పారితోషికం చెల్లించేందుకు కూడా వెనకాడటం లేదట.
ఇంకోవైపు నాగార్జున రాజకీయాల జోలికి అసలు వెళ్లడు.ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు.
ఇలా అన్ని ఇక ఈ టాలీవుడ్ కి బాగా కలిసి వస్తుందని తెలుస్తోంది.ఇలా ఓ వైపు సినిమాలు మరో వైపు వాణిజ్య ప్రకటన తో నాగార్జున రెండు చేతులారా సంపాదిస్తున్నారు.