1.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.ముంబై లో 230 మంది డాక్టర్ల కు కరోనా
ముంబై లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.తాజాగా అక్కడ 230 మంది డాక్టర్లు వైరస్ భారిన పడ్డారు.
3.జగన్ కు లోకేష్ లేఖ
ఏపీ సీఎం జగన్ కు పోలవరం నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.
4.నేడు పిఆర్సి పై క్లారిటీ
ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాలు భేటీ కాబోతున్న నేపథ్యంలో పిఆర్సి పై క్లారిటీ రాబోతోంది.
5.తిరుపతి వాసులకు టిటిడి గుడ్ న్యూస్
తిరుపతి వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.స్థానికంగా ఉండే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటాను పెంచింది.
6.కొత్తగూడెం ఎమ్మెల్యే బహిరంగ లేఖ
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు.
తన కుమారుడు రాఘవ పై వచ్చిన ఆరోపణల పై ఆయన స్పందించారు.పోలీసులకు తన కుమారుని అప్పగించేందుకు సహకరిస్తానని ఆయన లేఖలో ప్రస్తావించారు.
7.ప్రధాని కాన్వాయ్ ఘటనపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటన పై హీరో సిద్ధార్థ స్పందించారు.ఇదో పెద్ద డ్రామా అంటూ ఆయన ట్వీట్ చేశారు.
8.సుప్రీంకోర్టు ప్రధాని కాన్వాయ్ వ్యవహారం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ను అడ్డుకోవడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
9.వివాదంలో ఆచార్య సినిమా
ఆచార్య సినిమా వివాదంలో చిక్కుకుంది.ఈ సినిమాలోని ఓ పాట ఆర్ఎంపీ డాక్టర్లను అవమానించే విధంగా ఉందని తెలంగాణలోని జనగామ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10.డాక్టర్లు నర్సులకు సెలవులు రద్దు
తెలంగాణలోని డాక్టర్లు నర్సులకు సెలవులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వచ్చే నాలుగు వారాల పాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి.
11.చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 3 రోజుల పాటు ఈ జిల్లాలో పర్యటించనున్నారు.
12.నేటి నుంచి తమిళనాడు లో నైట్ కర్ఫ్యూ
కరోనా వైరస్, ఒమి క్రాన్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడులో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తెచ్చారు.
13.ఏపీలో కరోనా .ఒమిక్రాన్
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 434 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అలాగే 4 ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
14.కాంగ్రెస్ జనా జాగరణ దీక్షలు
కాంగ్రెస్ పీసీసీ వ్యవహారాల కమిటీ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాగరణ దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
15.బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పెద్ద ఆర్టిస్ట్ అని , ఆయనకు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
16.జిన్నా టవర్ ను సందర్శించిన మేయర్
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు జిన్నా టవర్ ను సందర్శించారు.
17.తెలంగాణా లో నాలుగు రెట్లు కేసులు పెరుగుతాయ్
దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ మొదలయ్యింది అని, తెలంగాణలోనూ నాలుగు రెట్లు కేసులు పెరుగుతాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డి హెచ్ శ్రీనివాసరావు చెప్పారు.
18.దేశంలో 148.67 కోట్ల వాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో 148.67 కోట్ల వాక్సిన్ డోసులు ఇప్పటి వరకు పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది.
19.మోదీ కాన్వాయ్ ఘటనపై రాష్ట్రపతి ఆందోళన
ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో నిలిపి వేసిన ఘటన పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆందోళన వ్యక్తం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,830
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,830
.