వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇటీవల మీడియా సమావేశంలో.ఓ విలేకరి ఏపీలో పార్టీ.
పెడతారా అంటూ ప్రశ్నించగా దానికి ఆమె తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.దేశంలో ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు అంటూ.
, పెట్టకూడదనే రూల్ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించడం జరిగింది.
పొలిటికల్ పార్టీ అంటే ఎక్కడైనా పెట్టొచ్చు అంటూ ఆమె తనదైన శైలిలో చెప్పటంతో… షర్మిల వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైసిపి పార్టీ ని టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో కథనాలు ప్రసారం చేస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ఇటువంటి తరుణంలో షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు.వైయస్ షర్మిల.తామంతా వైఎస్ఆర్ కుటుంబం అని.అందరం ఒకటే నని చెప్పుకొచ్చారు.అంత మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె పార్టీ పెడతానని ఎక్కడా చెప్పలేదని… అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి బాలినేని సీరియస్ అయ్యారు.