క్రికెట్ ఆటలో ఏ రికార్డు నెలకొల్పినా అది ప్రపంచానికి తెలిసి తీరుతుంది.అందుకే క్రికెట్ కు అంత క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది.
తాజాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో న్యూజిలాండ్ జట్టుతో జరిగినటువంటి మొదటి టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.న్యూజిలాండ్ దేశంలో జరిగిన మ్యాచ్ లో అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రదర్శనను కొనసాగించింది.
మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది.దీంతో ఆ జట్టు రికార్డును బద్దలు కొట్టింది.8 వికెట్ల తేడాతో మొదటి డబ్బ్యుటీసీ టైటిల్ విజేతను బంగ్లాదేశ్ ఓడించింది.న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో బంగ్లాదేశ్ కు మరో 12 పాయింట్లు రావడంతో ఆ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.
డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఐదో స్థానానికి చేరింది.డబ్ల్యుటీసీ 2021-23 సీజన్లో పాకిస్తాన్ టీమ్ తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ వైట్వాష్ అవ్వడం విశేషం.
కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్ పర్యటనకు బంగ్లాదేశ్ అద్బుత ప్రదర్శనతో ఆడింది.
కొత్త సంవత్సరంలో చరిత్ర నెలకొల్పింది.తన విజయాన్ని నమోదు చేసి రికార్డు నెలకొల్పింది.దీంతో పాయింట్ల పట్టికలో టాప్-5 ర్యాంకులో బంగ్లాదేశ్ నిలవడం విశేషం.
యాషెస్ సిరీస్ దక్కించుకున్న ఆస్ట్రేలియా 36 పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉంది.ఈ సీజన్లో ఓడిపోని శ్రీలంక జట్టు 24 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది.
ఇకపోతే పాకిస్తాన్ జట్టు 36 పాయింట్లతో మూడవ ప్లేస్ లో ఉంది.టీమిండియా చూస్తే 53 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.వెస్టిండీస్ 12 పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా న్యూజిలాండ్ జట్టు 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.ఇంగ్లాండ్ 6 పాయింట్లతో 8వ ర్యాంకులో నిలిచింది.సౌతాఫ్రికా జట్టు జీరో పాయింట్లతో దిగువనే ఉంది.ఇంగ్లండ్ టీమ్ చూస్తే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో టెస్టు సిరీస్లలో డ్రాతోపాటు ఒక మ్యాచ్లో టీమిండియా అపజయం పొందింది.