బుక్ మై షో కూడా 'పుష్ప' కు ఆ రికార్డును కట్టబెట్టింది

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రష్మిక మందన్నా హీరోయిన్‌ గా దేవి శ్రీ మ్యూజిక్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా విడుదల అయిన రోజు వచ్చిన టాక్ తో సినిమా కనీసం బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

 Book My Show Also Say Pushpa Is No.1 Movie In India In 2021, Book My Show, Pushp-TeluguStop.com

బన్నీ మంచి జోష్‌ మీద ఉన్న సమయంలో సుకుమార్‌ ఇలాంటి సినిమా ఇచ్చాడేంటి.మళ్లీ దీనికి రెండవ పార్ట్‌ అవసరమా.

అస్సలు వద్దు అన్నట్లుగా నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేశారు.కాని కట్‌ చేస్తే పుష్ప ఇండియాస్ 2021 బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది.

బాలీవుడ్‌ లో విడుదల అయిన సూపర్‌ స్టార్‌ అక్షయ్ కుమార్‌ సూర్య వంశీ కంటే కూడా అధిక వసూళ్లను దక్కించుకుంది.ఆ సినిమా 300 కోట్ల ముందు ఆగిపోయింది.

కాని పుష్ప సినిమా మాత్రం 300 కోట్ల కు మించి వసూళ్లు సాధించింది.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

సరే నిర్మాతలు అంటే ప్రచారం కోసం అలాంటి ప్రకటన చేసి ఉంటారు అనుకుందాం.కాని ఇప్పుడు బుక్‌ మై షో కూడా ఇండియాస్ నెం.1 బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప అని తేల్చి పారేసింది.2021 లో పుష్ప సినిమా టికెట్లను అత్యధికంగా తాము అమ్మినట్లు
గా బుక్‌ మై
షో ప్రకటించింది.ఏకంగా 50 లక్షల టికెట్లు కేవలం బుక్ మై షో ద్వారా అమ్ముడు పోయినట్లుగా వారు ప్రకటించారు.

Telugu Allu Arjun, Show, India, Pushpa, Rasmika Mandana, Sukumar, Tollywood-Movi

అంటే దాదాపుగా కోటి మందికి పైగానే ఈ సినిమాను చూసినట్లుగా ఒక అంచనా వేస్తున్నారు.గత ఏడాది విడుదల అయిన సినిమాల సంఖ్య భారీగానే ఉన్నా కూడా పుష్ప సినిమా నే ఇండియాస్ నెం.1 గా నిలవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube