ఉదయ్ చోప్రా ఈ పేరు గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.కానీ ధూమ్ సిరీస్ సినిమాలు చూసే వారికి ఉదయ్ చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బాలీవుడ్ దర్శకుడు యష్ చోప్రా కి తనయుడుగా ఉదయ్ చోప్రా మనందరికీ సుపరిచితమే.అంతే కాకుండా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన ఆదిత్య చోప్రా కి తమ్ముడు కూడా.
అయితే ఉదయ్ చోప్రా కి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో వెండితెరపై విజయం సాధించలేకపోయాడు.
ఉదయ్ చోప్రా కేరీర్ లో ఒక ధూమ్ సిరీస్ తప్ప పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏమీ లేవు.
అయితే సినిమాల విషయంలో అతడికి సరైన గుర్తింపు లేకపోయినా కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుంది అని ముంబైలో తెగ వార్తలు వినిపించాయి.ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉదయ్ చోప్రా వ్యక్తిగత జీవితంలో కూడా అంతే రిచ్ గా ఉంటాడు అని సమాచారం.
అంతేకాకుండా అప్పట్లో అమెరికన్ బ్యూటీ అయిన నర్గీస్ ఫక్రీతో చాలాకాలంపాటు డేటింగ్ చేశాడు అని వార్తలు కూడా వినిపించాయి.ఇక ముంబైలో పుట్టిన ఉదయ్ చోప్రా కొన్నేళ్ళ క్రితం లాస్ ఏంజెల్స్ నగరంలో ఒక విలాసవంతమైన భవనానికి యజమానిగా కొనసాగాడు.
ఆ తరువాత 2019 లో ఆ మాన్షన్ ని అమెరికన్ సింగర్ అయినా కామిలా కాబెల్లో కి అమ్మేశాడు.
3.38 మిలియన్ డాలర్లకు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 25.21 కోట్లకు డీల్ సెటిల్ అయింది అన్నమాట.ఇది ఇలా ఉంటే అమెరికన్ సింగర్ కామిలా కాబెల్లో ప్రస్తుతం ఒకసారి వార్తల్లో నిలిచింది.ఉదయ్ చోప్రా నుంచి కొనుక్కున్న తన అమెరికన్ మాన్షన్ ని 4.3 మిలియన్ల డాలర్లకు అనగా 32 కోట్ల కు అమ్మేసిందట.ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా సంస్థలు నిర్ధారించాయి.
కామిలా లాక్ దాని సమయంలో తన బాయ్ ఫ్రెండ్ అయిన సింగర్ షాన్ మొండిస్ తో ఇదే భవంతిలో గడిపింది.ఇక ఆ సమయంలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.