టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ మనందరికీ సుపరిచితమే.తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా అల్లు శిరీష్ ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే.అలా ఎందుకు దూరంగా ఉంటున్నాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.
అయితే సినిమా షూటింగ్ కోసమా? లేకపోతే ఇంకేదైనా నా అనేది తెలియడం లేదు.అంతే కాకుండా అప్డేట్లు ఏమీ ఇవ్వడం లేదు.
అల్లు శిరీష్ ప్రస్తుతం అను ఇమాన్యుయేల్తో కలిసి చేస్తోన్న ప్రేమ కాదంటా.అనే ఒక్క సినిమా ఉంది.
అయితే ఆ సినీమా గురించి కానీ ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందా లేదా? అసలు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇంతవరకు రాలేదు.ఈ ప్రేమ కాదంటా అనే సినిమా టైటిల్ విషయం గురించి పక్కన పెడితే.అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ మధ్య ఇప్పటివరకు ఎన్నో రకాల రూమర్స్ వినిపించాయి.ఇద్దరూ కలసి ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ, వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు అంటూ ఇలా వివిధ రకాలుగా వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి.
సినీమా షూటింగ్ సెట్లో, అలాగే ఆన్ లొకేషన్ లో,ఆఫ్ లొకేషన్లో వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ ఒక విషయంలో ఎమోషనల్ అయ్యాడు.హిందీలో జెర్సీ సినిమాను అల్లు శిరీష్, దిల్ రాజు, నాగ వంశీ కలిసి నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా హార్డింగ్ ను చూసి అందులో అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని చూసి ఎమోషనలయ్యాడు.ఇలా అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్లో ఓ హోర్డింగ్లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను.
ఇలా మొత్తానికి ఇది జరిగింది అంటూ అల్లు శిరీష్ ఒక ట్వీట్ చేసాడు.అల్లు శిరీష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.