ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ గా ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.19 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో మొత్తానికి టైటిల్ విన్నర్ గా సన్నీతో ముగిసిపోయింది.గత నాలుగు సీజన్ ల కంటే ఈ సీజన్ కాస్త కొత్తదనంతో ప్రసారమైంది.ఇక ఈ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.
కానీ సిరి, షణ్ముఖ్ మాత్రం తమకున్న గుర్తింపును కోల్పోయారు.వీరిద్దరు బిగ్ బాస్ ముందు యూట్యూబ్ ద్వారా స్టార్లుగా మారారు.
దీంతో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు.కానీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఉన్న గుర్తింపును మొత్తం కోల్పోయారు.
ఫ్రెండ్షిప్ అని చెప్పి తెగ రొమాన్స్ లతో రెచ్చిపోయారు.
పైగా ఇద్దరు రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు.
షణ్ముఖ్ అందరి ముందు దీప్తి సునయన ను ప్రపోజ్ చేసి మరి తన లవ్ గురించి అందరికీ తెలిసేలా చేశాడు.ఇక సిరి మరో సెలబ్రెటీ శ్రీహన్ తో నిశ్చితార్థం కూడా జరుపుకుంది.
త్వరలోనే అతడిని పెళ్లి కూడా చేసుకోనుంది.కానీ సిరి మాత్రం తాను రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని మర్చిపోయి మరి బాగా రెచ్చిపోయింది.
షణ్ముఖ్ కూడా తను దీప్తి సునయన తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని మర్చిపోయి సిరితో బాగా మూవ్ అయ్యాడు.కెమెరాల ముందు ముద్దులుపెట్టుకుంటూ బాగా హాట్ టాపిక్ గా నిలిచారు.దీంతో వీరి గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్, నెగటివ్ కామెంట్లు బాగా వచ్చాయి.పలుమార్లు నాగార్జున కూడా వీరి రిలేషన్ గురించి ఓపెన్ కామెంట్లు చేశాడు.
కానీ వీళ్ళు మాత్రం తమ రిలేషన్ ను అలాగే కొనసాగించారు.హౌస్ నుండి బయటికి వచ్చాక తమది ఫ్రెండ్షిప్ అని ఒప్పించడానికి ప్రయత్నించారు.కానీ జనాలు మాత్రం వీరి మాటలను నమ్మలేదు.ఫ్రెండ్షిప్ అయితే కిస్ లు కూడా చేసుకుంటారా అని బాగా కామెంట్లు కూడా పెట్టారు.ఇక తాజాగా వీరిద్దరి రిలేషన్ గురించి తమతో గడిపిన టైటిల్ విన్నర్ సన్నీ కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.
తాను సిరికి ఒక మాట చెప్పాలని అనుకున్నానని అన్నాడు.దోస్తాన్ దోస్తానే కానీ బయట నిన్ను నమ్ముకొని ఒక మనిషి ఉన్నాడు అని శ్రీహాన్ ను ఉద్దేశించి అన్నాడు.పాపం అతడు ఫీల్ అవుతాడు కదా అని చాలా సార్లు చెప్పాలి అనిపించిందట సన్నీకి.
కానీ ఇది నేరుగా చెప్పాలనుకున్నప్పుడల్లా తమకు కొంచెం సమయం కావాలి అని.ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు అని అన్నారట.దీంతో కనెక్షన్ లేనప్పుడు ఇంకేం చేస్తాం అని అన్నాడు సన్నీ.మొత్తానికి వారి రిలేషన్ గురించి సన్నీ షాకింగ్ కామెంట్ చేయగా ప్రస్తుతం ఈ మాటలన్ని వైరల్ గా మారాయి.