ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తోంది.అదేమిటంటే ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అన్నది? ఆసక్తికరంగా మారింది.అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ ల అభిమానులు వారి అభిమాన కంటెస్టెంట్ గెలిచారు అని చెప్పుకుంటున్నారు.కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల మేరకు ఈ సారి బిగ్ బాస్ టైటిల్ షణ్ముఖ్ జస్వంత్, సన్నీలలో ఎవరో ఒకరు గెలవవచ్చుని అభిప్రాయపడుతున్నారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ బిగ్ బాస్ షో చూస్తుండగానే ముగింపు దశకు చేరుకుంది.మొదట 19 కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలి ఉన్నారు.
ఇకపోతే నేడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియనుంది.
దీనితో ప్రేక్షకులు టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నారు.మరొకవైపు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు చెమటలు పడుతున్నాయి.నేడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియనుండటంతో కంటెస్టెంట్ లకు టెన్షన్ మొదలయింది.
ఇదిలా ఉంటే అన్ అఫీషియల్ ఓటింగ్లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది.కానీ ఇదే నిజమని పూర్తిగా నమ్మలేం.
ఎందుకంటే కొన్ని షాకింగ్ ఎలిమినేషన్ లతో బిగ్బాస్ మనం ఊహించనివి కూడా చేసి చూపిస్తాడని నిరూపించాడు.అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సన్నీ విన్నర్ అని, షణ్ముఖ్ ట్రోఫీ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయాడని పుకార్లు మొదలయ్యాయి.
అయితే షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన కంట కూడా పడటంతో,ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టింది.జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.ఇక బిగ్బాస్ 4 వ సీజన్ కంటెస్టెంట్ దేత్తడి హారిక అయితే ఏకంగా స్టార్ మాను తిడుతూ పోస్ట్ పెట్టింది.ఇది చెత్త నిర్ణయం స్టార్ మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్తో వీక్షకుల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయి.ఇంతకీ ఎవరు గెలిచారని హారిక అలా పోస్ట్ పెట్టిందని గుసగుసలు పెడుతున్నారు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.