హైదరాబాద్ లో అమానుషమైన ఘటన జరిగింది.ఒక అమాయకుడైన కార్మికుడి పైన హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఆ యువకుడు మరణించాడు.ఈ ఘటన హైదరాబాద్ లోని కేపీ హెచ్ బి లోని ఒక హోటల్ లో చోటు చేసుకుంది.
బిర్యానీ కోసం ఆ కార్మికుడు అర్ధరాత్రి పూట ఒక హోటల్ కి వెళ్ళాడు.కానీ అలా వెళ్లడమే ఆ యువకుడి పట్ల శాపమైంది.
ఇంతకీ ఏం జరిగింది.ఆ యువకుడి పై హోటల్ సిబ్బంది ఎందుకు దాడి చేసారు.
చంపేసేలా ఎందుకు ప్రవర్తించారు.అనే విషయాలను తెలుసు కోవాలంటే పూర్తి మ్యాటర్ లోకి ఎంటర్ అవ్వాల్సిందే.
ఒడిశాకు చెందిన ఆ యువ కార్మికుడు తన కుటుంబ సభ్యులతో కలిసి మాదాపూర్ ఇజ్జత్ నగర్ లో ఉంటున్నాడు.ఇక్కడే అతడు భావన కార్మికుడిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అతడు ప్రగతి నగర్ లో పని ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్ళడానికి బయలు దేరాడు.ఇంటికి వెళ్తున్న సమయంలో అతడికి బిర్యానీ తినాలని అనిపించి కూకట్ పల్లి లోని మెయిన్ రోడ్ పక్కనున్న మొఘల్స్ పారడైజ్ రెస్టారెంట్ కు వెళ్ళాడు.
అయితే అతడు హోటల్ కు వెళ్లిన సమయంలో ఎవ్వరు కనిపించక పోవడంతో సెల్లార్ లో ఎవరైనా ఉన్నారేమోనని అక్కడి వెళ్ళాడు.
కానీ అక్కడ అతడికి ఊహించని ఘటన ఎదురైంది.అతడు వెళ్లిన సమయంలోనే అక్కడ ఒక బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.అప్పుడు హోటల్ సిబ్బంది అతడిని చూసి దొంగ అనుకుని ఆ యువ కార్మికుడు అయినా రాజేష్ ను అందరు కలిసి ఒకేసారి దాడికి పాల్పడ్డారు.
దీంతో అతడు స్పృహ కోల్పోయిన అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
తెల్లారిన తర్వాత మళ్ళీ హోటల్ సిబ్బంది చూసి అతడి ఫోన్ నుండి కుటుంబ సబ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.కానీ అప్పటికే అతడు మరణించాడు. ఇలా మానవత్వం మరచి అతడు దొంగో కాదో తెలియకుండా దాడి చేసి చంపేయడంతో స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హోటల్ సిబ్బందిపై రాజేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.