వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్న నాటి నుండి ఆయన అనుచరుడిగా కృష్ణాజిల్లాలో పేర్ని నానికి మంచి పేరు ఉంది.కాగా వైయస్ మరణించిన అనంతరం పేర్ని నాని.
పొలిటికల్ గా వైయస్ జగన్ వెంటే నడుస్తూ ఉన్నారు.జగన్ మాటే శాసనంగా భావిస్తూ రాజకీయాలలో రాణిస్తున్నారు.
జగన్ కి అత్యంత నమ్మకమైన నేతగా పార్టీలో ఎదిగారు.దీంతో 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నానికి సీఎం జగన్ రవాణా, సమాచార శాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా వాటితోపాటు అదనంగా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ బాధ్యతలు కూడా అప్పజెప్పడం జరిగింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్ టికెట్ల రేట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది.ఆన్ లైన్ బుకింగ్ విధానం ద్వారా.
సినిమా లవర్స్ కి తక్కువ ధరలోనే సినిమా టికెట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉంది.ఈ క్రమంలో ఇప్పటికే మండల్, మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల వారీగా ధరలు నిర్ణయించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తప్పుబట్టారు.బెనిఫిట్ షో వేయకుండా, టికెట్ ధరలు నిర్ణయించకుండా పెంచకుండా.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఇండస్ట్రీకి అదే రీతిలో నిర్మాతలకు మేలు చేసేవి కాదని చాలామంది చెప్పుకొచ్చారు.
అయితే ఇంకా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇటీవల హైకోర్టు.ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 35 ను తప్పుపట్టడం జరిగింది.అంతేకాక సినిమా టికెట్ల రేట్లను పెంచుకునే అధికారం నిర్మాతలకు ఉందని ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేయడం జరిగింది. హై కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు యధావిధిగా గతంలో మాదిరిగానే.
పెంచుకునే తరహాలో బెనిఫిట్ షోలు వేసుకునే విధంగా పరిస్థితి మారింది.అయినా కానీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా పై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉండగా.
మంత్రి పేర్ని నాని కి తాజాగా సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో.రాజకీయంగాను, సినిమా ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది.