రంగా రెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 1 వ డివిజన్లోని మైత్రి పురం లో 40 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాల్ మరియు సిసి రోడ్డును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాలనీవాసులు మహిళా సోదరీమణులు భారీ ఎత్తున పాల్గొని మంత్రిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపు లల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్, స్థానిక కార్పొరేటర్ భూపాల్ రెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.