నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ‘.ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కరోనా అడ్డంకిగా మారింది.
ఇక ఎట్టకేలకు డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో విడుదల అవ్వగా ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో నందమురి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన స్థాయి సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
ముందు నుండి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ మాత్రమే వచ్చాయి.ఇక అఖండ సినిమాతో బాలయ్య అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుని ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించాడు.
బోయపాటి, బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా కూడా హిట్ అయ్యి వీరి కాంబినేషన్ కు తిరుగు లేదు అని మరొకసారి నిరూపించారు.
మాస్ యాక్షన్ తో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని కట్టి పడేసింది.తెలుగులోనే కాకుండా ఓవర్శిస్ లో కూడా అఖండ ప్రభంజనం చూపించింది.ఇక ఇక్కడ కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దూసుకు పోతుంది.
తాజాగా ఈ సినిమా విజయం కావడం వల్ల దిల్ రాజు బాలయ్యకు అఖండ టీమ్ కు పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమాను నైజాం ఏరియాతో పాటు.
వైజాగ్ ఏరియాకు కూడా దిల్ రాజు తన బ్యానర్ ద్వారా పంపిణీ చేసాడు.
ఇక దిల్ రాజు డిస్టిబ్యూటర్ గా మంచి లాభాలు అందుకోవడంతో అఖండ సక్సెస్ ఇచ్చిన సంతోషంతో టీమ్ అందరికి పార్టీ ఇచ్చాడు.సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ప్రగ్య జైశ్వాల్ తో పాటు దిల్ రాజు స్నేహితులు కూడా హాజరయ్యారు.ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు బాలయ్యతో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు.కానీ ఇప్పటి వరకు ఈ కాంబో సెట్ అవ్వలేదు.ఇక త్వరలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుందని సమాచారం.అయితే ప్రెసెంట్ బాలయ్య చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.
అవి పూర్తి అయిన తర్వాత వీరి కాంబో ఉండవచ్చని అనుకుంటున్నారు.మరి చూడాలి వీరి కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో.