ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.
రాష్ట్రంలో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులు గాంధేయవాద పద్ధతిలో పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
పాదయాత్రకి హైకోర్టు నుండి అనుమతులు పొందిన… పోలీసులు వారిని అడ్డుకోవడంతో దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని.స్పష్టం చేశారు.ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఈ తరుణంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మధ్యలో లేచి.కేవలం సీబీఐ కేసుల నుండి తప్పించుకోవటానికి రఘురామకృష్ణంరాజు.
ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఆయనపై ఉన్న కేసుల విషయంలో తప్పించుకోవటానికి బీజేపీ లో జాయిన్ అవ్వడానికి.
తహతహలాడుతున్నారని.రఘురామ కృష్ణం రాజు పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని.
ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో డిమాండ్ చేశారు.