మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న ఈమె సుఖేష్ తో ఆమెకు సంబందాలు ఉన్నట్లు వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ అవాస్తవాలు అంటూ ఆమె వాటిని కొట్టిపారేసింది.కానీ ఇటీవలే సుఖేష్ చంద్రతో కలిసి దిగిన ఫోటో వైరల్ అవ్వడంతో ఈమె మరొకసారి చిక్కుల్లో పడింది.
200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నిందితుడు సుఖేష్ ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటో, అతనితో మరింత సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఇండియా నుంచి వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకోవడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి మరొక వార్త బయటకు వచ్చింది.
సుఖేష్ చంద్ర నుంచి ఈమె కోట్ల రూపాయల బహుమతి పొందినట్టు ఈ విచారణలో తేలింది అని సమాచారం.
చంద్రశేఖర్ ఆమె కోసం ఒక ప్రైవేట్ జెట్ ను ఏర్పాటు చేయడంతోపాటు 52 లక్షల గుర్రం, 9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు, 10 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సుఖేష్ చంద్రశేఖర్ భార్య లీనా పాల్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.చంద్రశేఖర్ జాక్వెలిన్ తో పాటుగా బాలీవుడ్ లో మరొక హీరోయిన్ అయినా నోరా ఫతేహి కి కూడా భారీగా బహుమతులు ఇచ్చాడట.
బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్ తో పాటుగా కోటి విలువచేసే గిఫ్టులు కూడా పంపించాడని సమాచారం.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.