ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరేమో.ఇటీవల అసెంబ్లీ ఘటనలో ఆయన పేరు జాతీయ మీడియాలో కూడా మార్మోగిపోయింది.
ఇప్పటికే ఆయనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.ఆయనేనండి వల్లభనేని వంశీ.
ఈయన మొదటి నుంచి టీడీపలోనే ఉన్నారు.ఆ పార్టీలోనే బలమైన నేతగా ఎదిగారు.
అయితే ఇప్పుడు వైసీపీ మద్దతుదారుగా కొనసాగుతున్నారు.వైసీపీ కండువా కప్పుకోకపోయినా కూడా ఆ పార్టీకి సపోర్టుగానే మాట్లాడుతున్నారు.
ఇక చంద్రబాబును అయితే ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ నేతలు జగన్ ను ఏమైనా అంటే మాత్రం వెంటనే రియాక్ట్ అయిపోయి వారిని తనదైన స్టైల్ లో చెడుగుడు ఆడేసుకుంటాడు.
ఇలాంటి వంశీకి ఇన్ని రోజులు వైసీపీ నేతలు అండగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యమే.కానీ ఇప్పుడు ఆయన వల్ల జగన్ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి.
మొన్న జరిగిన అసెంబ్లీ ఘటన పెను దుమారమే రేపింది.వంశీ కామెంట్లను వైసీపీకి ఆపాదించి జాతీయ మీడియా కూడా విమర్శించిది.
దీంతో వైసీపీ నేతలు వంశీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.వంశీ దూకుడు వల్ల మొత్తం పార్టీకి చెడ్డ పేరు వస్తోందని గ్రహించిన వైసీపీ అగ్రనేతలు ఆయన్ను దూరం పెట్టాలని డిసైడ్ అయిపోయారంట.
ఇందుకు నిదర్శనమే జగన్ సొంత జిల్లా అయినా కడపలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కామెంట్లు.ఈయన జగన్కు అత్యంత సన్నిహితుడు.ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన కామెంట్లను తమ పార్టీకి అంటగడితే ఎలా అంటూ చెప్పేశారు.అంటే వంశీకి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారన్నమాట.
మొన్నటి దాకా వైసీపీకి అనుకూల వ్యక్తిగా చూసిన వంశీని.ఇప్పుడు దూరం పెట్టేందుకు రెడీ అయిపోయారని సమాచారం.
మొత్తానికి వైసీపీ గేమ్ లో వంశీ ఒంటరయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు.