నడుము గిల్లాడంటూ వ్యక్తిపై కేసు పెట్టిన నటి స్నేహ.. ఆ తర్వాత ఆ వ్యక్తి భార్య ఏం చేసిందంటే?

కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందినవాళ్లు తెలిసీ తెలియకుండా పొరపాట్లు చేస్తుంటారు.మరికొందరు మరింత హోదా కోసం కావాలని కూడా చేస్తుంటారు.

 Actress Sneha Filed  A Case Against The Man For What Did The Man Wife Do After T-TeluguStop.com

కానీ ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.కానీ అలా కావాలని చేయటం వల్ల లేదా పొరపాట్లు చేయడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలలో తిరిగి వారికే సీన్ ఎదురవుతుంది.

అలా నటి స్నేహ కు కూడా ఎదురయ్యింది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఒకప్పటి తెలుగు సిని నటి, అందాల ముద్దుగుమ్మ స్నేహ గురించి అందరికి తెలిసిందే.తన అందంతో, తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అంతేగాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకుంది.

ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

తొలిసారిగా తొలివలపు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.చాలావరకు క్లాస్ సినిమాలలో మాత్రమే నటించింది.

ఈమె నటించిన సినిమాలలో ప్రియమైన నీకు, శ్రీరామదాసు వంటి పలు సినిమాలు తనకు మంచి గుర్తింపునిచ్చాయి.

Telugu Sneha, Tollywood-Movie

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది.ఈమె మరో సినీ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకుంది.వీరిద్దరు కలిసి పలు సినిమాలలో కూడా నటించారు.బుల్లితెరపై కూడా పలు యాడ్స్ లలో చేశారు.ఇదిలా ఉంటే స్నేహ గతంలో చాలా వివాదాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని అతడిని ఏకంగా జైలుపాలు చేసింది.

ఆ తర్వాత ఓసారి తను ఏకంగా గుడిలో చెప్పులు వేసుకొని ప్రదక్షిణలు చేయడంతో ఆమెపై ఎంతోమంది విరుచుకుపడ్డారు.

ఇక ఆమె గతంలో కేరళలోని తిరుచ్చి పట్టణంలో ఓ షాపు ప్రారంభోత్సవానికి వెళ్ళింది.అక్కడ చాలామంది అభిమానులు ఉండటంతో అందులో స్నేహ గట్టిగా అరిచిందట.వెంటనే తన సెక్యూరిటీ ఏం జరిగింది అని అడగటంతో ఎవరో తనను నడుము గిల్లారని తెలిపింది.

Telugu Sneha, Tollywood-Movie

పైగా అక్కడ ఓ వ్యక్తిని కూడా చూపించింది.వెంటనే ఆ వ్యక్తిని చాలా కొట్టారు.పైగా పోలీసులకు అప్పగించారు.

ఇక అతని పేరు సురేష్ అని అతను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలిసింది.ఆ తర్వాత అతడు బెయిల్ ద్వారా బయటకు వచ్చాడట.

కానీ అంతటితో ఆగకుండా అతడి భార్య తన భర్తను అందరి ముందు అవమానించిందని, జైలుకు పంపించిందని పరువునష్టం వేసింది.

ఆ సమయంలో తను కూడా తన భర్త పక్కనే ఉన్నానని.

నిజానికి తాము స్నేహకు దూరంగా ఉన్నామని, ఆమె మా పై పొరపాటు పడిందని తెలిపింది.దీంతో న్యాయస్థానం కూడా అతడి భార్య చెప్పిన విషయంలో న్యాయం ఉందని ఒప్పుకున్నారు.

చివరకు స్నేహకు పరువు నష్టం దావా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube