ప్రేమమ్ సినిమా తో నటిగా పరిచయం అయిన సాయి పల్లవి తెలుగు వారికి మాత్రం ఫిదా సినిమా తో పరిచయం అయ్యింది.ఫిదా సినిమా లో ఆమె భానుమతిగా నటించి మెప్పించింది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావడం లేదు.స్టార్ హీరోలు.
పెద్ద సినిమాలు ఇలా భారీగా ఆమె ప్రాజెక్ట్ లు కొనసాగుతున్నాయి.ప్రముఖ హీరోలు మరియు దర్శకులు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఆమె క్రేజ్ అలాంటిది అనడంలో సందేహం లేదు.పాన్ ఇండియా హీరోయిన్ గా సాయి పల్లవికి గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు ఆమె చెల్లి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తాజాగా ఆమె నటించిన సినిమా జీ 5 ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగు మరియు తమిళంలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
సాయి పల్లవి చెల్లి అనే బ్రాండ్ వల్ల ఆమె కు భారీగా పేరు వస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇదే సమయంలో సాయి పల్లవి తో సినిమాలు చేసేందుకు తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.మొదటి సినిమా విడుదల అయ్యిందో లేదో అప్పుడే ఈ అమ్మడి డేట్ల కోసం తెలుగు నిర్మాతలు అడ్వాన్స్ లు పట్టుకుని ఆమె కోసం ప్రయత్నిస్తున్నారు.
కొందరు అయితే సాయి పల్లవి ద్వారా ఆమెను సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నారు.పూజా కూడా నటిగా పాజిటివ్ మార్కులు దక్కించుకుంది.అంతే కాకుండా అక్క సాయి పల్లవి మాదిరిగా నాచురల్ బ్యూటీ అన్నట్లుగా ఈఅమ్మడు ఉంటుంది.అందుకే చాలా మంది సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు.
త్వరలోనే పూజా కన్నన్ తెలుగు లో ఫిదా చేయడంకు వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.