విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా తెలుస్తోంది.ఛార్మితో కలిసి ఈ సినిమా ను పూరి నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్ లో ఈ సినిమా ను కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది.
భారీ ఎత్తున అంచనాలున్న లైగర్ సినిమా యూఎస్ షెడ్యూల్ ను ముగించారు.మూడు వారాల క్రితం లాస్ ఏంజిల్స్ కు వెళ్లిన లైగర్ టీమ్ వారం రోజుల క్రితమే షూటింగ్ ను ముగించినట్లుగా చెబుతున్నారు.
మైక్ టైసన్ షూట్ ముగియడంతో ఆయన వ్యక్తిగత బాక్సింగ్ గ్లౌజ్ లు పూరికి ఇవ్వడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులకు గుడ్ బై చెప్పేశాడు.ఆయన షూటింగ్ ముగించిన లైగర్ యూనిట్ సభ్యులు వెంటనే ఇండియా రావాల్సి ఉంది.
కాని ఇప్పటి వరకు ఇండియాకు లైగర్ టీమ్ తిరిగి రాలేదు.
దాంతో అసలు అక్కడ వీళ్లు ఏం చేస్తున్నారు అంటున్నారు.అసలే కరోనా కొత్త వేరియంట్ మొదలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో అక్కడ ఉండటం ఏమాత్రం సేఫ్ కాదని విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఇండియాకు రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంకా వీళ్లు అక్కడే ఉన్నారు అనేందుకు సాక్ష్యం అన్నట్లుగా లైగర్ నిర్మాత అయిన ఛార్మి లాస్ ఏంజిల్స్ లో మంచు వర్షం పడుతున్న సమయంలో రోడ్డు మీద అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది.
లైగర్ యూనిట్ సభ్యులు అకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ నుండి లైగర్ టీమ్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.
ఇక లైగర్ ను వచ్చే సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.