మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం గా మారింది.రాజకీయాల్లో ఎంతో సీనియర్ కావడంతో.
పాటు మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా.రోశయ్య రాణించడంతో ఆయన మరణ వార్త పై చాలా మంది తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతున్నారు.
ఇప్పటికే చాలామంది నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.
తెలుగు రాష్ట్రం ఒక సీనియర్ రాజకీయ నేతలు కోల్పోయిందని అన్నారు.ఒక మంత్రి ముఖ్యమంత్రిగా ఎదిగి అందరినీ కలుపుకొని… సమర్థవంతంగా పని చేసిన నాయకుడు కొణిజేటి రోశయ్య అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గొప్ప సేవలు అందించారని తెలిపారు.పార్టీ కోసం ప్రజల కోసం ఆయన ఎంతో పని చేశారని నరసయ్య చూసి ప్రస్తుతం ఉన్న నాయకులు చాలా నేర్చుకోవచ్చని తెలిపారు.
గుంటూరు ప్రాంతంలో ఎన్నో మంచి పనులు చేశారని.మంచి నాయకుడిని కోల్పోయాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పార్టీ తరఫున తెలియజేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ మృతి పట్ల స్పందించారు.