టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి మనందరికీ తెలిసిందే.ఈమె ప్రస్తుతం ముంబైలో తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి ఉంటుంది.
శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ఒక వైపు తండ్రి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా శృతిహాసన్, ఆమె ప్రియుడు, సోదరి అక్షర హాసన్ ముగ్గురు కలిసి రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అలాగే తన ప్రియుడు శాంతను హజారికకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది.
శృతి హాసన్ కు పాటలు పాడటం డ్యాన్సులు చేయడం అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే.మొదట సంగీత దర్శకురాలిగా కెరీర్ ను ప్రారంభించిన శృతిహాసన్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.
అయితే తాజాగా శ్రుతీ హాసన్ ఒక గంట సేపు డ్యాన్స్ చేశానని ఆ తరువాత నార్మల్ అయ్యాను అంటూ తెలిపింది.
ఇలా శ్రుతీ హాసన్ మాత్రం రోజూ వర్కవుట్లతో బిజీగా ఉంటుంది.అలా ఈ రోజు ఓ గంట పాటు డ్యాన్స్ చేసి తన ఒత్తిడిని తగ్గించుకుంటాను అని తెలిపారు.కెరీర్ పరంగా శ్రుతీ హాసన్ ఇప్పుడు కాస్త వెనకబడిన రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ చిత్రంలో శ్రుతీ హాసన్ మెరిసింది.
క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో ఆమె కెరీర్ కాస్త మల్లీ ఊపందుకుంది.అందుకే ప్రభాస్ పక్కన సలార్ సినిమాలో బాలయ్య సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది.