బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో కరీనా కపూర్ కూడా ఒకరు.తన నటనతో ఈ నటి ఏకంగా ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.
రెప్యూజీ అనే మూవీతో 2000 సంవత్సరంలో కరీనా కపూర్ నటిగా ఎంట్రీ ఇచ్చారు.జబ్ వియ్ మెట్ సినిమా నటిగా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది.
ఈ సినిమాకు ముందు కరీనా కపూర్ నటన చాలా సినిమాలలో ఒకే విధంగా ఉందంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
కరీనా కపూర్ ప్రముఖ నటులలో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు.
తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ నటిగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.అయితే ఈ నటిని నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
హీరోయిన్ల బట్టల విషయంలో కొన్నిసార్లు నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తం కావడం సాధారణంగా జరుగుతుంది.
కరీనా కపూర్ తరచూ కొత్తరకం దుస్తులను ట్రై చేస్తూ ఉంటారు.
తాజాగా కరీనా కపూర్ బ్లాక్ కలర్ మెష్ టాప్ లో మెరిశారు.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లలో కొందరు కరీనా కపూర్ నైటీతో బయటకు వచ్చిందని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు స్టార్స్ అందరూ డబ్బు ఉన్నవాళ్లే అని అయితే వాళ్లకు వేసుకోవడానికి బట్టలు మాత్రం ఉండవని అభిప్రాయపడుతున్నారు.అయితే నెటిజన్ల ట్రోల్స్ గురించి కరీనా కపూర్ స్పందించలేదు.
గతంలో కూడా నెటిజన్లు పలువురు హీరోయిన్లను ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత నెటిజన్లలో కొంతమంది హద్దులు దాటి ట్రోల్ చేస్తున్నారు.కరీనా కపూర్ ను గతంలో కూడా కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేశారు.
మరోవైపు వరుస సినిమా ఆఫర్లతో కరీనా కపూర్ బిజీగా ఉన్నారు.