1.46 ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న సింగపూర్ తెలుగు సమాజం
సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది.రెడ్ క్రాస్ సహకారంతో నవంబర్ 27,28 తేదీల్లో స్థానిక హెల్త్ సర్వీస్ అధారిటీ సింగపూర్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది.
2.టెంపా లో యూత్ క్రికెట్ టోర్నమెంట్ నాట్స్ మద్దతు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్ ) టెంపా లో టెంపా క్రికెట్ లీగ్ వారు నిర్వహించిన అండర్ 15 యూత్ క్రికెట్ టోర్నమెంట్ కు తన వంతు సహకారాన్ని అందించింది.
3.అమెరికా లో కరోనా ఆంక్షలు కఠినతరం
అమెరికాలో ఓమి క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు అధ్యక్షుడు జో బైడన్ మరింత కఠినతరం చేశారు.ప్రయాణానికి 24 గంటల ముందే కొవిడ్ టెస్ట్ చేయించుకున్న వారికి మాత్రమే అనుమతి మంజూరు చేస్తున్నారు.
4.దివాళా తీసిన పాకిస్థాన్
ఈ ఏడాది చివరి నాటికి దివాళా తీసిన అణ్వస్త్ర దేశంగా పాకిస్థాన్ మిగులుతుంది అని నివేదికలు తేల్చాయి.ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
5.ఐ ఎం ఎఫ్ గీతా గోపీనాథ్ కు అత్యున్నత పదవి
అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐ ఎం ఎఫ్ ) ఉన్నత స్థాయి చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ కు అత్యున్నత పదవి లభించింది.ఐ ఎం ఎఫ్ లో అత్యున్నత స్థాయి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు ఆమె స్వీకరించారు.
6.డబ్ల్యూ హెచ్ ఓ ప్రకటన
కరోనా కొత్త వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
7.జర్మనీలో షరతులతో లాక్ డౌన్
కరోనా కొత్త వేరియంట్ ఓమి క్రాన్ ను ఎదుర్కునేందుకు జర్మని షరతులతో కూడిన లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రకటించింది.
8.ఒమి క్రాన్ ఔషదం తయారు చేసిన జర్మనీ
ఓమి క్రాన్ వైరస్ ను ఎదుర్కునే ఔషధాన్ని గుర్తించినట్టు జర్మనీ ప్రకటించింది.ఈ ఔషధం పేరు సొట్రో విమాబ్.
9.వాక్సిన్ తీసుకోని వారిపై లాక్ డౌన్ ఆంక్షలు
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వాక్సిన్ తీసుకోని వారి పై జర్మనీ లాక్ డౌన్ ఆంక్షలు విధించింది.
10.అమెరికా లో 9 శాతం తగ్గిన హెచ్ వన్ బీ వీసా దారులు
అమెరికాలో హెచ్ వన్ బీ వీసాదారుల సంఖ్య భారీగా తగ్గింది.దాదాపు 9 శాతం తగ్గుదల కనిపించింది.