నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ ఎత్తున ఈ సినిమాకు ఓపెనింగ్స్ దక్కాయి.
బాలయ్య కెరీర్ లోనే కాకుండా ఈ ఏడాదిలో వచ్చిన అత్యధిక వసూళ్ల జాబితాలో ఈ సినిమా టాప్ లో నిలిచింది.అద్బుతమైన ఈ సినిమా కు అన్ని విధాలుగా పాజిటివిటీ కలిసి వచ్చింది.
ముఖ్యంగా ఈ సినిమా కు పోటీ లేక పోవడం కలిసి వచ్చింది.అందుకే 50 కోట్ల మార్క్ ను చాలా ఈజీగా ఈ సినిమా దాటడం ఖాయం అయ్యింది.
ఇక వంద కోట్ల క్లబ్ విషయంలోనే అనుమానాలు ఉన్నాయి.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కామెడీ ఎంటర్ టైనర్ స్కైలాబ్ సినిమా ఫలితాన్ని బట్టి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తేలిపోయే అవకాశం ఉంది.
సత్యదేవ్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా కామెడీ కాన్సెప్ట్ తో స్కైలాబ్ సినిమా ను తెరకెక్కించారు.ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడాలి చూడాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో బోయపాటి తెరకెక్కించిన సినిమా అఖండ ఫలితం మారుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ముందు వచ్చి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న కారణంగా అఖండకు వచ్చిన నష్టం ఏమీ లేదు అనేది కొందరి అభిప్రాయం.
ఒక వేళ స్కైలాబ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంటే అప్పుడు అఖండ జోరు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు.అయితే అఖండ ఇప్పటికే రెండు రోజుల్లో భారీగా నే రాబట్టాడు.కనుక ముందు ముందు కలెక్షన్స్ తగ్గి యావరేజ్ గా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు.కనుక అఖండ జోరుకు స్కైలాబ్ అడ్డు కట్ట వేయడం అనేది చాలా కష్టమైన విషయం.
అడ్డుకోలేక పోవచ్చు అంటున్నారు.