ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
రెండోరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించిన జగన్.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యంగా ఉండండి అని.భరోసా ఇచ్చారు.అదే రీతిలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందని స్పష్టం చేశారు.కాగా రెండో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ తిరుపతిలో జగన్ వరద బాధితులను పరామర్శిస్తున్నారు.
తిరుపతిలో కృష్ణా నగర్, ఆటో నగర్ ప్రాంతాలలో జగన్ పర్యటిస్తూ ఉన్నారు.ఈ సందర్భంగా కూలిన ఇళ్లను పరిశీలించిన జగన్.ఆ తరువాత నేరుగా వరద బాధితులతో ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్న జగన్ ఈరోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లాల్లో పర్యటించడానికి రెడీ అవుతున్నారు.
ఆతర్వాత రివ్యూ మీటింగ్ నిర్వహించే అధికారులకు పలు సూచనలు చేసి రేణిగుంట నుండి.తిరిగి గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకోనున్నారు. దాదాపు రెండు రోజుల పాటు సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం తో.పాటు వరద బాధితులకు అనేక హామీలు ఇవ్వడం.రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.