టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వ్యాక్సినేషన్ కి సంబంధించి డేటా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే రీతిలో సెకండ్ వేవ్ తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటో తెలియజేయాలని కోరారు.రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయో ప్రజలకు తెలిసేలా సమాచారం అందించాలని అన్నారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.చాలా ప్రమాదకరమైనది అని.ప్రపంచ దేశాలు అంటున్నాయి.
ఈ సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి కేంద్రం దగ్గర నుండి రావలసిన వ్యాక్సినేషన్ స్టాక్ లేదా మెడిసిన్ కి సంబంధించి.
రాబట్టడంలో ప్రభుత్వం చురుకుగా పని చేయాలని పట్టాభి వైసీపీ ప్రభుత్వాని సూచించారు.కరోనా కేసులు బులిటెన్ విడుదల చేసే ప్రతి రోజు జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ కి సంబంధించి.
వివరాలు కూడా విడుదల చేయాలని పట్టాభి కోరారు.ఇంటింటికి సంబంధించి వ్యాక్సినేషన్ వివరాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అడిగి తెలుసుకోవాలని తెలియజేశారు.
ఇక బూస్టర్ డోస్ కూడా అవసరమని… అంటున్న తరుణంలో ప్రభుత్వం కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు.