సౌత్ లో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత సోషల్ మీడియాలో ఒక అరుదైన ఘనతను చేరుకుంది.ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
ఇక సమంత కొత్త కొత్త ఫ్యాషన్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే తాజాగా సామ్ ఒక అరుదైన ఘనతను సాధించింది.ఆమె సోషల్ మీడియా ఖాతా అయినా ఇన్స్టాగ్రామ్ లో సామ్ ఒక మైల్ స్టోన్ ను చేరుకుంది.సమంత ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించి అరుదైన మైల్ స్టోన్ ను అధిగమించింది.ఇక 20 మిలియన్ మార్క్ ను అధిగమించిన హీరోయిన్స్ లిస్టులో సామ్ కూడా చేరి పోయింది.
ఇక సమంత అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా దృఢంగా మారడమే కాకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంది.చైతూతో విడిపోయిన తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో సామ్ రూటు మార్చి మళ్ళీ వరుస అవకాశాలను అందుకుంటూ మిగతా హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది.
ఇక సామ్ ప్రెజెంట్ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది.దీంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక తమిళ్ సినిమా, ఇంకా రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.మరొక పక్క యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది.
ఇంకా ఈ మధ్యనే సామ్ హాలీవుడ్ మూవీలో కూడా ఛాన్స్ అందుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది.ఇక ఈ నెల విడుదల కాబోతున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మరిన్ని అవకాశాలు అందుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు