నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అఖండ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది.
బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కోసం అందరు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎదురు చూపులకు ఫలితం లభించింది.
విడుదల అయినా అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చుకుని మరొకసారి ఈ కాంబో సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక థియేటర్స్ దగ్గర ఎక్కడ చూసిన అఖండ మాస్ జాతర కనిపిస్తుంది.అయితే బాలయ్య ఈసారి మాత్రం సెంటిమెంట్ ను బ్రేక్ చేసాడనే చెప్పాలి.
దాంతో నందమూరి అభిమానులు నిరాశ చెందారు.ఇంతకీ బాలయ్య అభిమానులను నిరాశ పర్చడానికి గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తున్నారా.
బాలయ్య తన సినిమా ఏది రిలీజ్ అయినా కూడా చిత్ర యూనిట్ తో కలిసి హైదరాబాద్ లోని భ్రమరాంభ థియేటర్ లో ఫస్ట్ షో ను వీక్షిస్తారు.
అయితే ఈసారి అఖండ సినిమాను మాత్రం చూడడానికి బాలయ్య అక్కడికి రాకపోవడంతో బాలయ్య అభిమానులు నిరాశ చెందారని చెప్పాలి.బాలయ్య రాకపోయినా కూడా అక్కడే భ్రమరాంబ థియేటర్ లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇతరులతో కలిసి ఈ సినిమాను అక్కడ వీక్షించారు.
ఆ థియేటర్ లో ప్రేక్షకుల నుండి వచ్చిన భారీ స్పందనకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇక బాలయ్య రాకపోవడంతో కొద్దిగా నిరాశ చెందినప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేక పోయి ఉండవచ్చని తమని తాము నచ్చజెప్పుకున్నారు.ఇక ఆయన సినిమాకు చాలా సంవత్సరాల తర్వాత ఇంత రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.