బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పై తన దృష్టిని పెట్టినట్టు తెలుస్తోంది.తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోలతో ఆయన సినిమాలు చేయబోతున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇదిలా ఉంటే తాజాగా ‘అంతిమ్ ‘సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా సల్మాన్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
త్వరలోనే అగ్ర హీరో అయినా విక్టరీ వెంకటేష్ కలిసి సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నారట.
ఒకవేళ ఇదే నిజమైతే వెంకీమామ అభిమానులకు పండగే పండగ.హిందీలో సినిమాను చేస్తున్నారుగా అలాగే తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో సినిమా చేయొచ్చు కదా! అని ప్రశ్నించగా.
అప్పుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ. దబాంగ్ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాం.
కానీ ‘అంతిమ్ ‘సినిమాకు అంత సమయం లేదు.కరోనా తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఈ సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది అని తెలిపారు.
అలాగే తన తదుపరి సినిమా హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తాం అని అతను తెలిపారు.చిరంజీవి సినిమాలో నటిస్తున్నారట అని ప్రశ్నించగా? అప్పుడు అవును అంటూ సమాధానమిచ్చాడు.అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాను అని సల్మాన్ ఖాన్ తెలిపారు.సినిమా గురించి డీటెయిల్స్ అడగగా త్వరలోనే ఆ విషయాలను వెల్లడిస్తానని తెలిపారు.
ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ తెలుగులో కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.