మొదట్లో దిల్ రాజు గారికి కొంత అమౌంట్ ఇచ్చి, క్యారెక్టర్ని తీసుకున్నానని కొంతమంది తనను అన్నారని ప్రముఖ ఆర్టిస్ట్ పార్వతీశం అన్నారు.అంతే కాకుండా ఫైనాన్షియల్గా పెద్ద బ్యాగ్రౌండ్ ఉంది, ఇతను ఎక్కడి నుంచో వచ్చాడని కూడా తనను అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
కానీ చాలా మందికి తన బ్యాగ్రౌండ్ తెలియదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే తాను ఇంజినీరింగ్ చేసి, జాబ్ మానేసి ఇండస్ట్రీకి వచ్చానన్న ఆయన, ఇక్కడికి వచ్చే ముందే అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే వచ్చానని ఆయన స్పష్టం చేశారు.
సక్సెస్ అయితే ఓకే కానీ ఫెయిల్ అయితే ఒకవేళ ఎలా అన్నది కూడా తాను ఆలోచించానని, అప్పుడే ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఆ బాధను తట్టుకునే శక్తి ఉంటుందని ఆయన అన్నారు.ఆ విధంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఏమైనా అన్నింటినీ ఎదుర్కొంటూ అలా ముందుకు వెళ్లిపోతున్నానని ఆయన వివరించారు.
ఒకానొక సందర్భంలో దిల్ రాజు తనకు బంధువు అని కూడా ప్రచారం చేశారని పార్వతీశం అన్నారు.
కానీ నిజానికి తాను ప్రతీ ఆఫీస్కెళ్లి తన ఫొటోస్ వేసి వచ్చే వాణ్ని అని ఆయన చెప్పుకొచ్చారు.అలా ఫిలిం చాంబర్కి తనను పిలిచారని, అక్కడికి ఆడిషన్కి చాలా మంది వచ్చారని ఆయన అన్నారు.తనకి కూడా అక్కడే అవకాశం వస్తుందని బాగా నమ్మకం వచ్చిందని ఆయన చెప్పారు.
అయితే అక్కడికి యాంకర్ రవి కూడా ఎందుకు వచ్చాడో తెలియదు గానీ, అక్కడ తనను కలిసి మాట్లాడాడని ఆయన అన్నారు.బాగా చేశావ్ తమ్ముడు.పక్కా నువ్వు సెలక్ట్ అవుతావని కూడా రవి అన్నట్టు పార్వతీశం చెప్పారు.అలా అప్పుడు తాను సెలెక్ట్ అయ్యానని ఆయన వివరించారు.