ప్రముఖ కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించి అప్పుడే నెల రోజులు పూర్తి అయ్యింది.ఇతను మరణించి నెలరోజులు అయినప్పటికీ ఇప్పటికీ ఇతని మరణం నమ్మశక్యంగా లేదని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ రాజ్ కుమార్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎంతోమంది మనసు గెలుచుకున్నారు.ఇలా అతి చిన్న వయసులోనే విశేషమైన ఆదరణ దక్కించుకున్న పునీత్ మరణం తీరని లోటు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక పునీత్ మరణించి నెల రోజులు పూర్తి కావడంతో సోమవారం ఆయన ఇద్దరు సోదరులు పునీత్ భార్య ఇతర కుటుంబ సభ్యులు కంఠీరవ స్టూడియలో పునీత్ సమాధికి పూజలు చేశారు.ఇక పూజల అనంతరం పునీత సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పునీత్ కార్లు,కోట్లలో డబ్బు ఉన్నా కానీ అతని ప్రాణాలను నిలబెట్టడానికి ఐదు నిమిషాల సమయం దొరకలేదు అని గుర్తుచేసుకున్నారు.
ఈ విధంగా పునీత్ మరణించడంతో అతని మరణం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్భంగా రాఘవేంద్ర విలేకరుల సమావేశంలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా నాయండహల్లి జంక్షన్ నుంచి బన్నేరఘట్ట రోడ్డు మెగాసిటీ మాల్ జంక్షన్ వరకు 12 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుకు అతని పేరు పెట్టాలని బీబీఎంపీ నిర్ణయించింది.