మూడు వారాల బ్రేక్ తర్వాత మళ్లీ ఆహా లో అన్ స్టాపబుల్ షో తో బాలయ్య మళ్లీ ఎంటర్ టైన్ చేసేందుకు గాను వస్తున్నాడు.మొదటి రెండు ఎపిసోడ్స్ ను మోహన్ బాబు మరియు నానిలతో చేసిన బాలకృష్ణ మూడవ ఎపిసోడ్ ను ఎమ్మెల్యే రోజా తో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అంతలోనే ఆయన చేతికి ఆపరేషన్ జరగడంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ లో జరిగిన పరిణామాలు మరియు బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ వైకాపా ను ప్రభుత్వంను ఇంకా వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులను ఏకి పారేసిన విషయం తెల్సిందే.
ఆ విమర్శలను వైకాపా వారు కూడా తిప్పి కొట్టారు.ఆ సమయంలో బాలయ్యను కాస్త ఘాటుగానే విమర్శించారు.
ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్యే అయిన రోజా మరియు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్న లు కలిసి ఖచ్చితంగా అన్ స్టాపబుల్ లో కనిపించడం అసాధ్యం.
ఎందుకంటే రెండు పార్టీలకు చెందిన వారు ఇప్పుడు చాలా ఆవేశాలతో ఉన్నారు.ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు.ఇలాంటి సమయంలో బాలయ్య మరియు రోజాలు అన్ స్టాపబుల్ అంటూ షో లో సందడి చేస్తే జనాలు ఊరుకుంటారా.
మేము కొట్టుకుంటూ ఉంటే మీరు మీరు ఒకటా అన్నట్లుగా ఫైర్ అయ్యే అవకాశం ఉంది.అందుకే ఇప్పట్లో రోజాతో టాక్ షో కు బాలయ్య ఆసక్తి చూపించడం కష్టం.
బాలకృష్ణ మరియు బ్రహ్మానందం లు కలిసి మూడవ ఎపిసోడ్ లో సందడి చేయబోతున్నారు.ఆ తర్వాత ఎవరు వస్తారు అనేది చూడాలి. బాలకృష్ణ అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.మరో రెండు రోజుల్లో ఆ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.