సినిమాలలో సక్సెస్ సాధించినవాళ్లు రాజకీయాలలో కచ్చితంగా సక్సెస్ అవుతారా? అనే ప్రశ్నకు కాదని సమాధానం వినిపిస్తుంది.అయితే సినిమా రంగానికి చెందిన వాళ్లలో చాలామంది రాజకీయాలలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సినిమా రంగానికి చెందిన వాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు పార్టీలలో ఉన్నారు.అయితే రాజకీయాల పరంగా మాత్రం బేధాలు ఉన్నా కలిసి సినిమాలు చేస్తున్నారు.
అయితే ఏపీలోని అధికార పార్టీ అయిన వైసీపీకి మద్దతు ఇచ్చిన కమెడియన్లకు అవకాశాలు తగ్గడం గమనార్హం.అయితే యాదృచ్చికంగా ఈ కమెడియన్లకు అవకాశాలు రావడం లేదా? లేక ఎవరైనా టార్గెట్ చేసి వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.తెలుగులో టాప్ కమెడియన్లు అయిన అలీ, పోసాని కృష్ణమురళి, పృథ్వీరాజ్ లకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గాయి.
2019 ఎన్నికలకు ముందు ఈ కమెడియన్లు వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పాటు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు.
తాజాగా పోసాని కృష్ణమురళి టాలీవుడ్ లో టీడీపీ వాళ్లు ఎక్కువగా ఉన్నారని వాళ్లు తనకు సినిమా ఆఫర్లు రాకుండా చేస్తున్నారని వెల్లడించారు.తెలుగు సినిమాలకు వచ్చే ఆదాయంలో 45 శాతం ఏపీ నుంచి వస్తుందని పోసాని చెబుతున్నారు.
అయితే రాబోయే రోజుల్లో అయినా ఈ స్టార్ కమెడియన్లకు సినిమా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.వైసీపీలో చేరడం ఈ కమెడియన్లు చేసిన పాపమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.స్టార్ కమెడియన్లుగా ఒక వెలుగు వెలిగిన కమెడియన్లకు సినిమా ఆఫర్లు తగ్గడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి.30 ఇయర్స్ పృథ్వీకి కూడా ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు అంతకంతకూ తగ్గుతున్నాయి.అలీ బుల్లితెరపై ఆఫర్లతో బిజీగా ఉన్నా వెండితెరపై మాత్రం ఆఫర్లు దక్కడం లేదు.